సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు.అయితే ఈసారి పరిస్థితి వేరేగా ఉంది.
కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి.కనుక ప్రతి ఒక్కరు కూడా వారి వారి అభిమాన స్టార్స్ బర్త్డే వేడుకలకు దూరంగా ఉంటున్నారు.
మహేష్బాబు పుట్టిన రోజుకు కూడా ఈసారి పెద్దగా వేడుకలు ఉండవని తేలిపోయింది.నేడు మహేష్ బాబు ట్విట్టర్లో ఈ విషయమై స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా సామూహిక వేడుకలకు వెళ్లవద్దంటూ విజ్ఞప్తి చేశాడు.
ప్రస్తుతం ఉన్న విపత్తును దృష్టిలో పెట్టుకుని నా బర్త్డే వేడుకలు వద్దని మహేష్బాబు విజ్ఞప్తి చేశాడు.
మహేష్బాబు ఫ్యాన్స్కు ట్విట్టర్ ద్వారా.
మీరందరు నాకు తోడుగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు.మీరు అభిమానులుగా దక్కడం నా అదృష్టం.
నా పుట్టిన రోజు ప్రత్యేకంగా ఉండాలని మీరు చేయబోతున్న ప్రయత్నాలు మానుకోండి.ఏ ఒక్కరు కూడా సామూహిక వేడుకలు నిర్వహించవద్దు.
మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.ఈ యుద్ద సమయంలో మీరు సేఫ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంకు సంబంధించిన మొదటి పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఫ్యాన్స్కు మహేష్బాబు నుండి దక్కే బర్త్డే కానుక అదే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ జరగడం లేదు.వచ్చే ఏడాది ఆరంభం వరకు సర్కారు వారి పాట పట్టాలు ఎక్కేది లేనిది తెలియడం లేదు.అయితే సినిమాను మాత్రం వచ్చే ఏడాదిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.