సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన 47 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ యంగ్ అండ్ చార్మింగ్ లుక్ తో యువతను మాయ చేయడంలో ముందు వరుసలో ఉన్నాడు.
ఈ మధ్య మరిన్ని కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కూడా ఇప్పటికి యువతుల కళల రాకుమారుడిగా కీర్తించ బడుతున్నాడు.
టాలీవుడ్ లో మాత్రమే కాదు.
ప్రపంచ వ్యాప్తంగా ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరోగా ఫ్యాన్స్ చేత జేజేలు కొట్టించు కుంటున్నాడు.
ఈయన ఏజ్ పెరుగుతున్న అందం మాత్రం తగ్గడం లేదు.తాజాగా మహేష్ బాబు ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
తాజాగా మహేష్ నటించిన ఒక మసాలా యాడ్ రిలీజ్ అవ్వగా.ఈ యాడ్ లో మహేష్ లుక్ పర్ఫెక్ట్ అంటూ చర్చించు కుంటున్నారు.
ఈ లుక్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు.
ఈ యాడ్ లో మహేష్ హెయిర్ స్టైల్ మాత్రమే కాదు ప్రతీ విషయం గురించి తీవ్రంగా చర్చించు కుంటున్నారు.
మహేష్ కు ఈ యాడ్ లో ఉన్న లుక్ బాగా సూట్ అయ్యింది అంటూ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు సైతం చెబుతున్నారు.ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.
మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.అయితే మహేష్ ఫ్యామిలీ కారణాల వల్ల ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు.