టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న మహేష్, తన నెక్ట్స్ మూవీతోనూ సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ చాలా వైవిధ్యంగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.పూర్తి ఎంటర్టైనర్ మూవీగా సర్కారు వారి పాటను తీర్చిదిద్దాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
కాగా మహేష్ ఎప్పటినుండో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలో జక్కన్న ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత తన నెక్ట్స్ మూవీని మహేష్తో తీస్తాడని ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రాజమౌళి తెరకెక్కిస్తాడని తెలుస్తోండగా, ఈ సినిమాలో మహేష్ చేయబోయే పాత్ర గురించి తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మహేష్ ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.శివాజీ చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుందని, అదిరిపోయే లుక్లో శివాజీగా మహేష్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే రాజమౌళి భారీ సెట్స్ డిజైన్ చేయిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఏదేమైనా ఇంకా పట్టాలెక్కక ముందే మహేష్-రాజమౌళి చిత్రంపై ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
మరి జక్కన్న దర్శకత్వంలో శివాజీగా మహేష్ ఎలా ఉంటాడో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.