టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ప్రెసెంట్ ఈ షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, టీజర్ చూస్తేనే తెలుస్తుంది మహేష్ ఎంత యంగ్ గా కనిపించ బోతున్నాడో.ఇక యూరోపియన్ దేశంలో యాక్షన్ సీక్వెన్స్ ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తుంది.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడూ కనిపించని లుక్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తుంది.యాక్షన్ సన్నివేశంలో భాగంగా ఇంటర్వెల్ కు ముందు విలన్ కు మహేష్ బాబు లక్ష్మి నరసింహ స్వామి అవతారంలో కనిపిస్తాడట.
కొన్ని నిముషాల పటు మహేష్ ఆ గెటప్ లో కనిపించ నున్నారని సమాచారం అందుతుంది.అంతేకాదు ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ ను సింహాచలం టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్నారట.
ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్న సముద్రఖని కి మహేష్ నరసింహుడి అవతారంలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది.అంతేకాదు క్లైమాక్స్ కూడా సింహాచలం దేవాలయంలోనే ఉంటుందని ప్రచారం జోరుగా జరుగుతుంది.
ఇక మహేష్ నరసింహుడి అవతారంలో కనిపించడం నిజమైతే సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.ఎందుకంటే మహేష్ ఇప్పటి వరకు పౌరాణిక పాత్రల్లో నటించలేదు.మరి ఈ రూమర్స్ నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.ఇక రిలీజ్ విషయానికి వస్తే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పుడు రేస్ లోకి ఆర్ ఆర్ ఆర్ రావడంతో ఈ సినిమాను వాయిదా వేస్తారు అనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది.