కమల్ హసన్ కూతురు అనే ట్యాగ్ తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అందాల భామ శృతి హాసన్.ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కెరియర్ ఆరంభంలో కొంత ఇబ్బంది పడిన తరువాత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జతకట్టింది.
ఈమె కేవలం నటిగానే కాకుండా గాయనిగా, మ్యూజీషియన్ గా కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంది.మల్టీ టాలెంటెడ్ అయిన ఈ అమ్మడు ఇప్పటికే విదేశాలలో సంగీత ప్రదర్శనలు ఇస్తూ వస్తుంది.
ఎక్కువగా వెస్ట్రన్ సంగీతంతో స్టేజ్ షో లు ఇచ్చింది.అయితే ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఆల్బమ్స్ మీద దృష్టి పెట్టింది.
తన సంగీతం, సాహిత్యం, గానంతో ఆల్బమ్స్ డిజైన్ చేస్తూ సొంతంగా యుట్యూబ్ చానల్ లో రిలీజ్ చేయడం మొదలు పెట్టింది.
ఇక ఆమె మొదటి ఆల్బమ్ సాంగ్ ని ఎడ్జ్ టైటిల్ తో రిలీజ్ చేసింది.
ఇక ఈ వెస్ట్రన్ సాహిత్యంతో సాగే ఈ పాటకి ఆమె స్వరాలు అందించి తన గొంతుతోనే వినిపించారు.ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ పాట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా ఆకట్టుకుంది.ఈ పాటను ఎంతో ఇష్టపడుతున్నాను అంటూ మహేశ్ ట్వీట్ చేశారు.
కంగ్రాచ్యులేషన్స్ శ్రుతిహాసన్.నువ్వు ఆలపించిన ఎడ్జ్ పాటను విన్నాను.ఊపేసేయ్ అంటూ ప్రోత్సహించారు.ఎడ్జ్’ పాట పూర్తిగా ఆంగ్లంలో సాగుతుంది.ఈ గేయానికి సాహిత్యం కూడా శ్రుతిహాసనే సమకూర్చింది.మొత్తానికి మొదటి పాటతోనే శృతి హసన్ సోషల్ మీడియాని ఇప్పుడు షేక్ చేస్తుంది.మరి ఆమె తన టాలెంట్ ని ఇక ఏ రేంజ్ లో చూపిస్తుందో చూడాలి.