టాలీవుడ్ లో విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చే టాలీవుడ్ నటీనటుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.అయితే ఇతడు నటన పరంగానే కాకుండా తమ సాయం కోరి తమ వద్దకు వచ్చినటువంటి వ్యక్తులకు లేదనకుండా తోచినంత సహాయం చేసే మనసున్న వ్యక్తి గా మహేష్ బాబుకి మంచి పేరుంది.
అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా లాక్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.దీని వల్ల ఎంతో మంది సరైన వసతులు లేక మరియు కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటి వారి కోసం తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు విరాళంగా ప్రకటించారు.దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ లైఫ్ శ్రీమంతుడని అనిపించుకున్నాడు.
అలాగే మహేష్ బాబు ఇలాంటి సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.
దీంతో పలువురు రాజకీయ వేత్తలు మరియు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.విపత్తుల సమయంలో ఇలా టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వచ్చి ఆదుకుంటూ ఉండడంతో గర్వంగా ఉందని వాపోతున్నారు.
అలాగే ఈ విరాళాలు మరింత పెరిగే అవకాశం ఉంది.దీంతో తాజాగా మహేష్ బాబు చేసిన ఈ పనికి తెలంగాణ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ స్పందింస్తూ గ్రేట్ జాబ్ మహేష్ అంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.అంతేగాక ఇతర దేశాల్లో పలు నాన్ బాహుబలి రికార్డులు కూడా బద్దలు కొట్టింది.