సూపర్ స్టార్ కృష్ణ తన కెరియర్ లో ఏడాదికి పది సినిమాలు రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి.అయితే అతని వారసుడు మహేష్ బాబు మాత్రం సినిమాల విషయంలో చాలా క్లారిటీగా వెళ్తున్నాడు.
ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు.మిగిలిన టైం ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తున్నాడు.
అది కూడా సెలక్టివ్ దర్శకులు, సెలక్టివ్ కథలని మాత్రమే ఎంచుకుంటూ ముందుకి వెళ్తున్నారు.అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోగా మహేష్ ట్రాక్ రికార్డ్ ఉంది.
అతని ప్రతి సినిమా వంద కోట్లు చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది.ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు రెడీ అవుతున్నాడు.
అతని లిస్టులో వరుసగా దర్శకుల జాబితా ఉంది.వారిలో రాజమౌళి, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి ఉన్నారు.అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు.ఈ నేపధ్యంలో అతని కోసం ఓ మల్టీ స్టారర్ కథని అనిల్ రావిపూడి రెడీ చేసి వినిపించినట్లు తెలుస్తుంది.
లాక్ డౌన్ ఉంది కాబట్టి మహేష్ బాబు ఆ సినిమా కథను అనీల్ తో రెడీ కూడా చేయించాడు అని సమాచారం.అన్ని అనుకున్నట్టు జరిగితే మరో రెండేళ్లలో ఈ సినిమా విడుదల కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
మరి ఈ మల్టీ స్టారర్ సినిమాలో మహేష్ కాంబినేషన్ గా ఎవరిని తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.