ప్రస్తుతం నైజాం ఏరియాలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు హవా నడుస్తోంది.దిల్ రాజు చేతిలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఉండటంతో స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజుకు తమ సినిమాల హక్కులను ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే స్టార్ హీరో మహేష్ బాబు మాత్రం దిల్ రాజుపై కోపంగా ఉన్నారని సమాచారం. ఎఫ్3, సర్కారు వారి పాట సినిమాలు రెండు వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే.
సర్కారు వారి పాట సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తున్న సమయంలో ఎఫ్3 సినిమాను తక్కువ టికెట్ రేట్లతో రిలీజ్ చేయడంతో ఆ ప్రభావం సర్కారు వారి పాట సినిమాపై పడింది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ హక్కులను దిల్ రాజుకు ఇవ్వడానికి మహేష్ బాబు సుముఖంగా లేరని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
దిల్ రాజు మహేష్ బాబును కలిస్తే మాత్రమే ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది.
ఈ నెలాఖరు నుంచి మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.
దూకుడుగా ఉండే నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.దిల్ రాజు నిర్మాతగా తెలుగులో పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
మిడిల్ రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా దిల్ రాజు సినిమాలను నిర్మిస్తున్నారు.
దిల్ రాజు బ్యానర్ లో పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు తెరకెక్కుతున్నాయి.దిల్ రాజు చాలామంది స్టార్ హీరోలకు రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది.దిల్ రాజుకు నిర్మాతగా అంతకంతకూ క్రేజ్ పెరుగుతోంది.
వచ్చే ఏడాది దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు విడుదల కానున్నాయి.