ఇటీవల నమ్రత శిరోత్కర్ ఒక ఫోటో ను షేర్ చేసి షూటింగ్ ప్రారంభం అయ్యింది.షూటింగ్ టైమ్ అంటూ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు.త్రివిక్రమ్ ల కాంబో సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.
షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నాం… వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నాం అంటూ హాసిని అండ్ హారిక బ్యానర్ నుండి ప్రకటన వచ్చింది.మ్యాజిక్ తేదీ అయిన ఏప్రిల్ 28న ఈ సినిమా ను విడుదల చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీ గా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుంటే మొన్న నమ్రత షేర్ చేసిన ఫోటో దేని గురించి అయ్యి ఉంటుంది అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.
అసలు ఏం జరిగింది అంటూ మహేష్ బాబు అభిమానులు ఏం పాలు పోక జట్టు పీక్కుంటున్నారు.మహేష్ బాబు మరియు పూజా హెగ్డే ల కాంబో లో మొన్నటికి మొన్న టెస్ట్ షూట్ జరిగిందని.
రెండు రోజుల పాటు టెస్టు షూట్ జరిగిన తర్వాత మళ్లీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.ఆ షూట్ ను బట్టి సినిమా ను వచ్చే నెలలో పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నామని త్రివిక్రమ్ నుండి సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నటీ నటుల ఎంపిక జరుగుతుంది.త్వరలోనే సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి వరకు షూటింగ్ ను పూర్తి చేస్తామని త్రివిక్రమ్ అంటున్నాడు.
మరి అంత స్పీడ్ గా షూటింగ్ పూర్తి అయ్యేనా చూడాలి. మహేష్ బాబు తో త్రివిక్రమ్ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.