సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాకుండానే తదుపరి సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది.మహేష్ బాబు 28వ సినిమా గా రూపొందబోతున్న సినిమా కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నాడు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రీకరణ పూర్తి కాకుండానే త్రివిక్రమ్ మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.ఈ సినిమా కు పార్థు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా ను నిర్మిస్తున్న రాధా కృష్ణ హీరో మరియు దర్శకుడు కు ఎంతగా పారితోషికం ఇవ్వబోతున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం వీరిద్దరు కూడా టాలీవుడ్ లో టాప్ లో ఉన్నారు.
అలాంటి వీరు భారీ పారితోషికం తీసుకుంటారు అనే విషయంలో సందేహం లేదు.ప్రస్తుతం వీరిద్దరు తీసుకుంటున్న పారితోషికం ఆసక్తికరంగా మారింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో నటించినందుకు గాను మహేష్ బాబుకు పారితోషికంగా కొంత మొత్తం ఇవ్వడం తో పాటు సినిమా రిలీజ్ సమయంలో బిజినెస్ ను బట్టి లాభాల్లో వాటా ఇవ్వబోతున్నాడు.ఇక సినిమ విడుదల తర్వాత వసూళ్లలో కూడా వాటా ఇవ్వబోతున్నారు.
మొత్తంగా మహేష్ బాబుకు సినిమా విడుదలకు ముందు 30 కోట్లు దక్కబోతున్నాయి.విడుదల సమయంలో బిజినెస్ ఆధారంగా కనీసం 15 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.
ఇక సినిమా సక్సెస్ అయ్యి లాభాలు వస్తే 5 నుండి 10 కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.మొత్తంగా 50 నుండి 60 కోట్ల వరకు మహేష్ బాబు దక్కించుకునే అవకాశం ఉంది అంటున్నారు.
ఇక త్రివిక్రమ్ ఈ సినిమా కు మొదటి 20 కోట్లు విడుదల సమయంలో లాభాల్లో వాటాను దక్కించుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మొత్తంగా బడ్జెట్ లో వీరిద్దరి పారితోషికం 60 శాతం ఉన్నట్లుగా చెబుతున్నారు.
వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.