సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా ను త్రివిక్రమ్ తో అధికారికంగా ప్రకటించారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయమై గత కొన్నాళ్లుగా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కియారా అద్వానీ అంటూ కొందరు కాదు పూజా హెగ్డే అంటూ మరి కొందరు అంటున్నారు.ఇదే సమయంలో జాన్వీ కపూర్ ను కూడా సంప్రదించారనే వార్తలు కూడా వచ్చాయి.
మొత్తానికి పూజా హెగ్డే ఖరారు అంటూ కాస్త బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే ఆ సినిమా కు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదే సమయంలో సినిమా టైటిల్ గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబోలో సినిమా ను పట్టాలెక్కించే తేదీ అధికారికంగా రావాల్సి ఉంది.
ఇదే సమయంలో ఈ సినిమా కు సంబంధించిన కీలక వార్తలు వచ్చాయి.
అతడు సినిమా లో మహేష్ బాబు పార్థు అనే పాత్ర లో కనిపించాడు.
నందు మరియు పార్ధు పాత్రల్లో మహేష్ బాబు కనిపించాడు కనుక ఆ సినిమా లో పాత్రలను ఈ సినిమా కు లింక్ చేసి పార్ధు అనే సినిమా టైటిల్ ను అనుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఇదే సమయంలో నంద గోపాల్ అనే పేరు కూడా పరిశీలనకు వచ్చింది.
దాంతో త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు ల కాంబో సినిమా కు టైటిల్ విషయమై మీడియాలో గందరగోళ వాతావరణం నెలకొంది. మే 31 వ తారీకున సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ లోగోను ఆవిష్కరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆ లోపు టైటిల్ ను అధికారికంగా ఖరారు చేయాలి.కాని ఇప్పటి వరకు టైటిల్ ఎంపిక కాలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా టైటిల్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయట.అ అక్షరం కలిసి వచ్చేలా ఈ సినిమా టైటిల్ ను అనుకుంటున్నారు.