సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందబోతున్న ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవలే లాంచనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.ఎప్పటిలాగే మహేష్ బాబు తన సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు.
ఆయన స్థానం లో నమ్రత హాజరయ్యింది.ఇక త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమా లో కూడా పూజా హెగ్డే ను హీరోయిన్ గా నటింప చేస్తున్నాడు.
అల వైకుంఠ పురం లో అంతకు ముందు అరవింద సమేత సినిమాల్లో కూడా హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది.రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఆమెను ఎంపిక చేశాడు.
మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది.అలాగే పూజా హెగ్డే తో ఆయన చేస్తున్న మూడో సినిమా ఇది.కనుక సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందని నమ్మకం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో త్రివిక్రమ్ మరో సెంటిమెంటును కూడా రిపీట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.అదేంటంటే ఆయన ప్రతి సినిమాకు ‘అ‘ అనే లెటర్ తో టైటిల్ ని పెడుతున్నాడు.
కనుక మహేష్ బాబుకు కూడా అదే సెంటిమెంట్ ని రిపీట్ చేసే అవకాశం ఉంది.అందులో భాగంగా ఇప్పటికే కొన్ని పేర్లను కూడా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు పాత్ర పేరును అ అనే అక్షరంతో మొదలయ్యే ల డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.ఆ పేరునే సినిమా టైటిల్ గా కూడా పెడతాడని అంటున్నారు.అసలు విషయం ఏంటి అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సినిమా లకు సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి.
కనుక ఆ రోజున కచ్చితంగా త్రివిక్రమ్ సినిమా టైటిల్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.ఆ సమయం లో త్రివిక్రమ్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేశాడా లేదా అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.