సూపర్ స్టార్ మహేష్ బాబు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుంది.
ఇప్పటికే వీరిద్దరు కలిసి చేసిన అతడు మరియు ఖలేజా సినిమా లు థియేటర్లలో ఆకట్టుకోలేదు.కాని టీవీల్లో మాత్రం ఇప్పటికి సూపర్ హిట్ టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకుంటున్నాయి.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ విశేషాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఎప్పుడెప్పుడు సినిమా ప్రారంభం అవుతుందా అంటూ అంతా కూడా ఎదురు చూస్తున్న సమయంలో ఇంకా స్క్రిప్ట్ కు సంబంధించిన ఫైనల్ చర్చలు జరగలేదు అంటూ త్రివిక్రమ్ సన్నిహితుల ద్వారా మాకు సమాచారం అందింది.
త్వరలోనే మహేష్ బాబు విదేశాల నుండి ఇండియాకు రాబోతున్నాడు.కొన్ని వారాల క్రితం విదేశాలకు హాలీడే ట్రిప్ అంటూ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ జూలై రెండవ వారం లో ఇండియా లో ల్యాండ్ అవ్వబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు ఇండియా కు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు త్రివిక్రమ్ మరియు మహేష్ లు కలిసి ఫైనల్ వర్షన్ ను చర్చించబోతున్నారు.ఆ తర్వాత ఒపీనియన్ లు తీసుకున్న తర్వాత సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందంటూ సమాచారం అందుతోంది.
అంటే మహేష్ బాబు.త్రివిక్రమ్ ల కాంబో మూవీ పట్టాలు ఎక్కడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ విషయం లో కాకుండా పవన్ కళ్యాణ్ త్వరలో చేయబోతున్న సినిమా విషయమై త్రివిక్రమ్ చర్చల్లో ఉన్నాడు.దాంతో పాటు త్రివిక్రమ్ భార్య ఒక సినిమా తో నిర్మాతగా మారబోతున్నారు.
ఆ సినిమా స్క్రిప్ట్ వ్యవహారాలు కూడా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడని తెలుస్తోంది. సర్కారు వారి పాట విడుదల అయ్యి ఇన్నాళ్లు అవుతున్నా ఇంకా తదుపరి సినిమా మొదలు పెట్టక పోవడం పై ఫ్యాన్స్ తీవ్ర స్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.