మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఏడాది ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురంలో ను అందించాడు.ఆ వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ను మొదలు పెట్టేందుకు ప్రకటన చేశాడు.
కాని కరోనా కారణంగా ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం అయ్యింది.అదుగో ఇదుగో అంటూ సినిమా మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు.
ఎన్టీఆర్ తో సినిమా ను మొదలు పెట్టకుండానే క్యాన్సిల్ చేసిన త్రివిక్రమ్ ఆ వెంటనే మహేష్ బాబుతో కొత్త సినిమా ను ప్రకటించాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహేష్ బాబు తో మూవీ విషయంలో కూడా ఆలస్యం అవుతోంది.
పెద్ద ఎత్తున సినిమా కు సంబంధించిన అంచనాలు ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ కు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.మొదట సర్కారు వారి పాట చిత్రీకరణ పూర్తి అవ్వకుండానే త్రివిక్రమ్ మూవీ ని మహేష్ ప్రారంభించే అవకాశం ఉందని అంతా భావించారు.
కాని పరిస్థితులు అనుకూలించేలా లేవంటున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుతో సినిమా కోసం త్రివిక్రమ్ కనీసం ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు అయినా వెయిట్ చేయాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ లు జరగడం లేదు.సర్కారు వారి పాట చిత్రీకరణ మొదటు అయ్యేదుకు కనీసం నెల సమయం అయినా పడుతుందని అంటున్నారు.ఈ కారణంగా త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ బాబు ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు డేట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.ఎన్టీఆర్ తో సినిమా అయితే ఆలస్యం అవుతుందని మహేష్ బాబుతో సినిమా ను ప్లాన్ చేస్తే దీని పరిస్థితి కూడా అలాగే ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే త్రివిక్రమ్ సినిమా అధికారికంగా ప్రకటన ఇచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.