సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో మహేష్ కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తునట్టు ఇప్పటికే ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.
క్రోనా కారణంగా సర్కారు వారి పాట షూటింగ్ ఆలస్యం అవడంతో ఈ సినిమా కూడా లేట్ అవుతూ వస్తుంది.అయితే సర్కారు వారి పాట సినిమా షూట్ ఎట్టకేలకు చివరి భాగానికి చేరుకుంది.
దీంతో ఈ సినిమా షూట్ దీపావళికి ముందుగానే అయిపోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఇక త్రివిక్రమ్ తో సినిమాను దీపావళి తర్వాత స్టార్ట్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా ముందుగా ఒక పాట షూటింగ్ తో మొదలు పెట్టబోతున్నారట.ఆ పాట షూటింగ్ ముగియ గానే వెంటనే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ జరపనున్నారట.
ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను రామ్ లక్ష్మణ్ డిజైన్ చేయనున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.కరోనా నేపథ్యంలో అన్ని సినిమా షూటింగులు ఇప్పటికే ఆలస్యం అయినందున త్రివిక్రమ్ మహేష్ ఈ సినిమా ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ నిర్ణయించు కున్నారట.ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటించ బోతుంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటించనున్నారు.త్రివిక్రమ్ వరుస హిట్స్ తో దూకుడుగా ఉండడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.