సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘‘సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తునట్టు ఇప్పటికే ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబో రిపీట్ అవుతుంది.
అందుకే ఈ హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసారని సమాచారం.ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ప్రెసెంట్ మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చేస్తున్న విషయం విదితమే.
ఇక ఈ సినిమా షూట్ ను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయలని మహేష్ టార్గెట్ పెట్టుకున్నాడట.
అక్టోబర్ లో ఈ సినిమా షూట్ పూర్తి అవ్వగానే నవంబర్ మొదటి వారం నుండి త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట.అలాగే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికీ పూర్తి చేసి ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాను కుదిరితే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించే అవకాశం ఉందని నిర్మాత ఇప్పటికే తెలిపారు.