సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ ఆ తర్వాత నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.ఈ సక్సెస్ ఫుల్ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా శరవేగంగా పూర్తి చేసుకుని ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన జక్కన్న ఇప్పుడు మహేష్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం మహేష్ సినిమా కోసం కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.భారీ అడ్వెంచర్ కథ మహేష్ కోసం రెడీ అవుతుంది అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు.
తాజాగా మాత్రం మహేష్ బాబు సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది.రాజమౌళి, మహేష్ తో ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కించ బోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.1 నేనొక్కడినే తరహాలోనే ఈ సినిమా కూడా థ్రిల్లర్ కథాంశంతో తీయబోతున్నాడు అని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
చూడాలి రాజమౌళి ఈ సినిమాతో ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాడో.