తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణ వారసుడిగా ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేష్ బాబు ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారీ వారి పాట” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాలో మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ లో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్స్, మహేష్ చెప్పిన డైలాగులు, చూపించిన గ్రేస్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఇకపోతే ఈ సినిమాలో కీర్తి సురేష్ ను కూడా హైలెట్ చేసి చూపించడంతో ఈమె పాత్ర కూడా ఎంతో కీలకమైనదని తెలుస్తోంది.
అయితే మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ మొట్టమొదటిసారిగా నటిస్తున్నప్పటికీ ఏడు సంవత్సరాల క్రితమే కీర్తి సురేష్ మహేష్ బాబును కలిసింది.ఈ క్రమంలోనే అప్పటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఏడు సంవత్సరాల క్రితం కీర్తి సురేష్ నటించిన ఓ సినిమాను మహేష్ బాబు లాంచ్ చేశారు.
ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతుంది.ఈ ఫోటోలో రామానాయుడు, విజయ నిర్మల, నటుడు నరేష్ వుండగా చివరిలో కీర్తిసురేష్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు అప్పుడు మహేష్ బాబు ప్రోత్సహించటం వల్లే ఇప్పుడు అతని పక్కన సినిమాలలో నటిస్తూ జాతీయ అవార్డులను కూడా అందుకున్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.