మహేష్ బాబు గత ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ ఏడాది మహేష్ బాబు సినిమాలు ఏమీ రావడం లేదు.
కాని వచ్చే ఏడాది ఆరంభంలోనే సర్కారు వారి పాట సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మహేష్ బాబు సిద్దం అవుతున్నాడు.పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు పరశురామ్ కు అనూహ్యంగా గ్యాప్ వచ్చింది.ఆ గ్యాప్ ను సక్సెస్ తో ఫిల్ చేయాలని ఆశ పడుతున్నాడు.
ఈ సినిమా లో బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి మరియు అక్రమాల గురించి చూపించబోతున్నారు.పెద్ద ఎత్తున ఈ సినిమా షూటింగ్ ను దుబాయిలో చేశారు.ఇటీవలే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ చేస్తున్నారు.మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ లపై టీజింగ్ మరియు రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
టీజింగ్ సీన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది.మహేష్ బాబు ఈ మద్య కాలంలో టీజింగ్ సీన్స్ చేసిందే లేదు.
ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా లో ఆయన చేయబోతున్న సీన్స్ సినిమా కు హైలైట్ గా ఉంటాయని అంటున్నారు.ఇక కీర్తి సురేష్ మరియు మహేష్ బాబుల కాంబో లవ్ సీన్స్ మరియు పాటలు ఆకట్టుకుంటాయని అంటున్నారు.
పెద్ద ఎత్తున సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.థమన్ ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదల ను సంక్రాంతికి అంటూ ఖరారు చేయడం జరిగింది.గీత గోవిందం వంటి వైవిధ్యభరిత లవ్ ట్రాక్ మరియు బ్యాంకింగ్ రంగం లో జరుగుతున్న అవినీతిని కూడా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.