రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది.వైష్ణవ్ తేజ్ నటన కృతి శెట్టి క్యూట్ నెస్ విజయ్ సేతుపతి నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తే దర్శకుడు బుచ్చి బాబు మరో లోకంలో తన ప్రతిభతో విహరింప జేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎంతటి సినిమా అయినా ఈ మద్య కాలంలో రెండు వారాల తర్వాత అంతా మర్చి పోతున్నారు.అలాంటిది ఉప్పెన సినిమా ఇంకా కూడా థియేటర్లలో కుమ్మేస్తుంది.
ఒక వైపు ప్రేక్షకులు సోషల్ మీడియాలో అప్పటి నుండి ట్రెండ్డింగ్ లో నే ఉండేలా చర్చించుకుంటున్నారు.ఇక ఉప్పెన గురించి కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఏదో ఒకటి ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి వరుసగా ఉప్పెన సినిమా టీమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.మొన్న దేవి శ్రీ ప్రసాద్ కు మంచి పాటలు అందించినందుకు గాను ప్రత్యేకంగా లేఖ రాసి బహుమానం పంపించాడు.
ఆ తర్వాత కృతి శెట్టికి కూడా చిరంజీవి లేఖ రాశాడు.అందులో నీ నటన అద్బుతం అంటూ ఉప్పెన గురించి ప్రశంసలు కురిపించాడు.ఇక తాజాగా మహేష్ బాబు కూడా ఉప్పెన సినిమా ఒక క్లాసిక్ మూవీ అంటూ తేల్చి పారేశాడు.ఉప్పెన సినిమాకు టైమ్ తో సంబంధం లేదు.
ఎప్పటికి ఈ సినిమా ఫ్రెష్ గా ఉంటుందని ట్వీట్ చేశాడు.ప్రతి రోజు ఎవరో ఒక ప్రముఖ స్టార్ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా మహేష్ బాబు నుండి కామెంట్స్ రావడంతో ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో కంటిన్యూగా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.మొత్తానికి ఈ సినిమా మరో లెవల్ లో ఉందని టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.
టాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా ఉప్పెన నుండి బయట పడటం లేదు.