సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ తో మల్టీ ప్లెక్స్ ని స్టార్ట్ చేసి సినిమా బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే.నటన తర్వాత వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టాలని డిసైడ్ అయినపుడు ముందుగా అతను తనకి తెలిసిన థియేటర్స్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ నేపధ్యంలో ఎఏంబి సినిమాస్ ద్వారా మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాడు.బెస్ట్ ఇంటీరియర్ వర్క్ తో ఈ థియేటర్స్ ని డిజైన్ చేయించి ప్రేక్షకులకి అందుబాటులోకి తీసుకొచ్చారు.
థియేటర్ లో టికెట్స్ ధరలు అధికంగానే ఉన్న కూడా మల్టీప్లెక్స్ డిజైనింగ్ చూడటానికి చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు.ఈ నేపధ్యంలో తాజాగా ఈ ఎఏంబి సినిమాస్ అంతర్జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది.
మల్టీప్లెక్స్ లో వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ తదితర సదుపాయాలతో ఏఎంబీ సినిమాస్ ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ అనుభూతిని అందిస్తోంది
ఈ నేపధ్యంలో ‘ఇనవేషన్ అవార్డ్స్-2021’ లో లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఏఎంబీ సినిమాస్ ఫైనలిస్టుగా ఎంపికైంది.ఎవి ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వారు ఈ కేటగిరీలో భారతదేశం నుండి ఈ మల్టీప్లెక్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా ఏఏంబి సినిమాస్ స్టాఫ్, టెక్నికల్ సిబ్బంది, ఇతర నిర్వాహక బృందానికి అభినందనలు తెలియజేసింది.మీ అందరి సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది అని ఆమె వారిపై ప్రశంసలు కురిపించింది.
మొత్తానికి మహేష్ బాబు ఎఏంబి సినిమాస్ ద్వారా థియేటర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆరంభంలో అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.