సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మరియు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ రెండు సినిమాలతో మరో రెండు సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చాయి, కాని అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.
పెద్ద ఎత్తున ఈ రెండు సినిమాలు వసూళ్లను రాబట్టాయి.లాంగ్ రన్ పూర్తి అయిన తర్వాత ఏ సినిమా ఎంత వసూళ్లు చేసింది అనే విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
ఇప్పుడు ఈ విషయంలోనే రెండు సినిమాల నిర్మాతలు కూడా ఢీ అంటే ఢీ అంటూ పోరుకు సిద్దం అవుతున్నారు.అల వైకుంఠపురంలో చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అంటూ ప్రకటించారు.
నాన్ బాహుబలి రికార్డును కొట్టి ఇండస్ట్రీ హిట్ను దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు.మరో వైపు సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ను కొట్టింది అంటూ ప్రచారం చేస్తున్నారు.25 రోజులు పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం గ్రాస్ కలెక్షన్స్ తో నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుందంటూ పేపర్లో పెద్ద ప్రకటన వేశారు.
బాహుబలి రికార్డులను ఏ సినిమా క్రాస్ చేయలేదు.కాని ఇప్పుడు ఆ తర్వాత స్థానం కోసం ఈ ఇద్దరు హీరోల మద్య కోల్డ్ వార్ నడుస్తుంది.ప్రముఖుల విశ్లేషణ అడిగితే ఏ ఒక్కరు కూడా ఆ ఇద్దరు హీరోలతో వైరం ఎందుకు అనుకుంటూ సైలెంట్గా ఉంటున్నారు.
ఇటీవలే దిల్రాజు ఈ విషయం మాట్లాడుతూ ఇద్దరికి కూడా ఆల్ టైం హిట్ అయిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని బయ్యర్లకు మరియు నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టాయంటూ చెప్పాడు.అంతే తప్ప ఏది పై చేయి సాధించింది అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.