అల్లు అర్జున్, మహేష్బాబు ఒకే టీవీ షోలో కలిసి కనిపిస్తే ఎలా ఉంటుంది.చూడ్డానికి రెండు కళ్లు చాలవు కదా.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇలా కలిసి కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.ఆ అరుదైన సంఘటన వచ్చే సంక్రాంతికి మన ముందుకు రాబోతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్బాబు మరియు అల్లు అర్జున్లు కలిసి ఒక ఇంటర్వ్యూను ఇవ్వబోతున్నారు.ఆ ఇంటర్వ్యూను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్తో ప్రస్తుతం త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమాను చేస్తున్నాడు.ఆ సినిమా తాలూకు షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
సంక్రాంతి కానుకగా ఆ సినిమాను విడుదల చేయబోతున్నారు.ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ను కూడా జోరుగా చేస్తున్నారు.
వరుసగా సినిమా పాటలను విడుదల చేయడం వల్ల సినిమాకు సంబంధించిన వార్తలు జోరుగా మీడియాలో వస్తూ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.
ఇక సరిలేరు నీకెవ్వరు అంటూ మహేష్బాబు కూడా అదే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందోతున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి.ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇద్దరు హీరోలు కూడా కలిసి ఇంటర్వ్యూ ఇస్తే ప్రేక్షకులకు పాజిటివ్ వైబ్స్ వెళ్తాయని నిర్మాతలు భావిస్తున్నారట.
అందుకే త్రివిక్రమ్ ఇద్దరిని ఒప్పించే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.