సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని ఆరు నెలలు ప్రచారం జరిగింది.కాని తీరా ప్రారంభం కాబోతుంది అనగా కథ నచ్చక పోవడమో లేక మరేంటో కాని సినిమా క్యాన్సిల్ అయ్యింది.
మహేష్ బాబు ప్రస్తుతానికి మరో దర్శకుడితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
మహేష్ 27వ చిత్రం గురించి అనేక చర్చలు జరిగాయి.చివరకు క్లారిటీ వచ్చేసింది.
మహేష్బాబు 27వ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన మైత్రి మూవీస్ ఇంకా 14 రీల్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
స్క్రిప్ట్ వర్క్ను దర్శకుడు పరశురామ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.మహేష్ బాబు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ను కాస్త ఆలస్యంగా మొదలు పెట్టబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సినిమాను జులై నెలలో ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సినిమా కోసం మహేష్బాబు ఏకంగా 50 కోట్లకు మించిన పారితోషికం తీసుకుంటాడని సమాచారం అందుతోంది.మైత్రి మూవీస్ ఇంకా 14 రీల్స్ బ్యానర్లను నిర్మాణ సంస్థలుగా ప్రేక్షకులకు పరిచయం చేసింది మహేష్బాబే.అందుకే ఆయన రుణం తీర్చుకునేందుకు భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.