సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.భారీ అంచనాలున్న ఈ చిత్రంను మే 9న విడుదల చేయబోతున్నారు.
మహేష్ బాబు 25వ చిత్రం అవ్వడంతో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని భారీ ఎత్తున చిత్రీకరించారు.వంద కోట్లకు పైబడిన బడ్జెట్తో ఈ చిత్రంను రూపొందించారు.
ఇక మహేష్ 26వ చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.పాతిక నుండి 30 కోట్ల లోపు బడ్జెట్తోనే ఈ చిత్రంను పూర్తి చేసేందుకు అనీల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు
ప్రస్తుతం అనీల్ రావిపూడి కర్నూలులో పర్యటిస్తున్నాడు.
సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం సీన్స్ను అక్కడ చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.కర్నూలు పరిసర ప్రాంతాల్లో మరియు కర్నూలు కొండారెడ్డి గురుజు వద్ద సీన్స్ను షూట్ చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఈ విషయం తెలిసిన మహేష్బాబు ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.సినిమా తప్పకుండా విజయం అవుతుందనే నమ్మకంను అప్పుడే వ్యక్తం చేస్తున్నారు.మహేష్ 26వ చిత్రం కర్నూలులో చిత్రీకరిస్తే తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉండటంకు కారణం ఒక్కడు సెంటిమెంట్.అవును మహేష్బాబు నటించి సూపర్ హిట్ అయిన ఒక్కడు సినిమా కర్నూలు బ్యాక్ డ్రాప్లో ఎక్కువ సీన్స్ ఉంటాయి.
కొండారెడ్డి బురుజు వద్ద కూడా సీన్స్ను చిత్రీకరించారు.అప్పట్లో ఆ సినిమా సంచలనమే, మళ్లీ ఇన్నాళ్లకు మహేష్ కర్నూలు వెళ్లబోతున్న నేపథ్యంలో సక్సెస్ ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
ఈ చిత్రంతో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.ఇంకా పలు ప్రాముఖ్యతలు ఈ చిత్రంకు ఉన్నాయి.