సూపర్ స్టార్ మహేష్బాబు ఇటీవలే ‘భరత్ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించి టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో చేరింది.
మహేష్బాబు ఆ సినిమాలో సీఎంగా కనిపించి మెప్పించాడు.ఇక ప్రస్తుతం మహేష్బాబు తన 25వ చిత్రం కోసం సిద్దం అయ్యాడు.
ఇటీవలే మహేష్ 25 చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.డెహ్రాడూన్లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
మహేష్బాబుతో ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు మరియు అశ్వినీదత్లు నిర్మిస్తున్నారు.
మహేష్బాబు 25వ చిత్రాన్ని మొదట ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాల్సి ఉంది.కాని ఆయన్ను ఈ చిత్రం నుండి తప్పించిన దర్శకుడు వంశీ మరియు మహేష్బాబులు దిల్రాజు మరియు అశ్వినీదత్ల వద్దకు వచ్చారు.పీవీపీ నుండి ఎందుకు దూరంగా జరిగారు అనే విషయంలో క్లారిటీ రాలేదు.
తాను నిర్మించాల్సిన ప్రాజెక్ట్ను దిల్రాజు, అశ్వినీదత్ల వద్దకు వంశీ తీసుకు వెళ్లాడు అంటూ పీవీపీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చిన్న వివాదం కారణంగా తాను రెడీ చేయించిన కథతో మహేష్ ఎలా వారి బ్యానర్లో నటిస్తాడు అంటూ పీవీపీ నిర్మాతల మండలి వద్దకు వెళ్లాడు.
నిర్మాతల మండలిలో దిల్రాజు మరియు అశ్వినీదత్లకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడలేదు.దాంతో తనకు మండలిలో న్యాయం జరగదని నిర్ణయించుకున్న పీవీపీ కోర్టును ఆశ్రయించాడు.
కోర్టులో ఈ కేసు ఉన్న నేపథ్యంలో ఇంత కాలం షూటింగ్ వాయిదా వేస్తూ వచ్చారు.ఎట్టకేలకు పీవీపీని మహేష్బాబు ఒప్పించాడు అని, పీవీపీని ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా మార్చడంతో వివాదంకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యిందని మీడియాలో వార్తలు వచ్చాయి.
మహేష్బాబు చొరవతో ఈ గొడవకు ఫుల్స్టాప్ పడి సినిమా నిర్మాణం మొదలు అయ్యిందని భావిస్తున్న సమయంలో పిక్చర్ అభీ బాకీ హై అంటూ పీవీపీ అంటున్నాడు.
సినిమా నిర్మాణంలో మహేష్బాబు తనకు ఛాన్స్ ఇప్పిస్తాను అంటూ హామీ ఇచ్చినా కూడా పీవీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ముగ్గురు నిర్మాతలతో సినిమా అంటే మిగిలేది ఏమీ ఉండదు అంటూ ఆయన భావిస్తున్నాడు.నిర్మాణంలో మెజార్టీ భాగస్వామ్యం తనకు కావాలంటూ పీవీపీ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతానికి మెల్లగా డిమాండ్ చేస్తున్నప్పటికి సినిమా విడుదల సమయంకు ఖచ్చితంగా గట్టిగా డిమాండ్ చేయాలి అనేది పీవీపీ ప్లాన్గా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.మొత్తానికి మహేష్బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం ఇలా వివాదాలతో ముందుకు సాగుతుండటం ఫ్యాన్స్కు రుచించడం లేదు.