సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ వసూళ్లను దక్కించుకున్న ఆ చిత్రం తర్వాత మహేష్బాబు తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసేందుకు ఇప్పటికే కమిట్ అయిన విషయం తెల్సిందే.
దిల్రాజు బ్యానర్లో ఈ చిత్రం నిర్మాణం జరుగబోతుంది.అతి త్వరలోనే ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.
అయితే వంశీ పైడిపల్లి చాలా స్లోగా సినిమాలు తీస్తాడు కనుక వచ్చే ఏడాదిలో కాని ఈ చిత్రం రాదని అంతా అనుకున్నారు.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నాడట.
నటీనటుల ఎంపిక కార్యక్రమం దాదాపుగా ముగింపుకు వచ్చిందంటూ సమాచారం అందుతోంది.ఈ సమయంలోనే మహేష్బాబు వచ్చే నెల నుండి షూటింగ్కు జాయిన్ అవుతాడు అంటున్నారు.మార్చిలో షూటింగ్ మొదలు పెట్టి కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారట.అంటే ఆగస్టులో సినిమాను పూర్తి చేసి దసరా వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే యోచన చేస్తున్నారట.
ఈ వార్త వినేందుకు చాలా సంతోషంగా ఉన్నా కూడా మహేష్బాబుతో వంశీ పడిపల్లి అంత స్పీడ్గా సినిమా చేస్తాడా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.మహర్షి చిత్రాన్ని ఏకంగా సంవత్సరం పాటు వంశీ తీశాడు.ఇప్పుడు దీన్ని కూడా అంతే కాలం తీస్తాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సరిలేరు నీకెవ్వరు చిత్రం కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి అవ్వడంతో బడ్జెట్ తక్కువ అవ్వడం మరియు నిర్మాతలకు లాభాలు రావడం జరిగింది.
అందుకే ఈ చిత్రాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేయాలంటూ వంశీకి మహేష్ చెప్పాడట.ఇదే నిజం అయితే దసరాకు సినిమా రావడం ఖాయం, ఫ్యాన్స్కు పండుగే పండుగ.
ఒకే ఏడాదిలో మహేష్ రెండు సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది.అది ఈ ఏడాది జరుగబోతుందో చూడాలి.