క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ సాధించడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల జాబితాలో సుకుమార్ పేరు చేరిపోయింది.ఈ క్రమంలోనే సుకుమార్ వరుసగా బాక్సాఫీసు వద్ద 3 హిట్ సినిమాలను సొంతం చేసుకున్నారు.
రంగస్థలం నాన్నకు ప్రేమతో పుష్ప వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత సుకుమార్ తో సినిమా చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సుకుమార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
గతంలో మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నేనొక్కడినే చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే ఈ సినిమా అనంతరం మహేష్ బాబు-సుకుమార్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.
సుకుమార్ చేసిన వ్యాఖ్యల వల్ల మహేష్ బాబు చాలా హర్ట్ అయ్యారు అని వార్తలు రావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది.అయితే ప్రస్తుతం వీరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయని సుకుమార్ కోసం మహేష్ బాబు ఓ మెట్టుదిగి అతనితో సినిమా చేయడానికి వచ్చారని తెలుస్తోంది.
ఇప్పటికే సుకుమార్ మహేష్ బాబుకు కథ వినిపించగా ఆయనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.మహేష్ బాబు తన 28వ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయగా 29వ చిత్రాన్ని రాజమౌళితో చేయనున్నారు.రాజమౌళి సినిమా కూడా పూర్తి కాగా తన 30వ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో మహేష్ అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తూ మనస్పర్ధలు తొలగిపోయాయని భావిస్తున్నారు.
ఇక సుకుమార్ సైతం తన కోసం ఓ మెట్టు దిగిన మహేష్ బాబుకు మంచి హిట్ ఇవ్వాలని భావిస్తున్నారట.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.