సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు చాలా గట్టిగానే తలపడ్డాయి.ఈ రెండు చిత్రాల్లో అల వైకుంఠపురంలో చిత్రం పై చేయి సాధించింది అని చెప్పుకోవచ్చు.
అల వైకుంఠపురంలో చిత్రం సక్సెస్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి థమన్.ఆయన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా యూత్ ఆడియన్స్ను ఆయన పాటలు థియేటర్ల వద్దకు తీసుకు రావడంలో సక్సెస్ అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం అల వైకుంఠపురంలో సినిమా కలెక్షన్స్ దూసుకు పోతున్నాయి.
ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే.
అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించబోతున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న బన్నీ 20వ చిత్రం కోసం దేవిశ్రీ ట్యూన్స్ను సిద్దం చేసే పనిలో ఉన్నాడు.ఇక మహేష్బాబు 27వ చిత్రంకు థమన్ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 27వ చిత్రం రూపొందబోతుంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రెండు నెలల గ్యాప్ తర్వాత మహేష్ తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు.ఆ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించనున్నాడు.
గతంలో మహేష్తో థమన్ పలు చిత్రాలు చేశాడు, అవి సక్సెస్ అయ్యాయి.ఇప్పుడు మరోసారి చేయబోతున్నాడు.
సంక్రాంతికి పోటీ పడ్డ హీరోల సంగీత దర్శకులు కుండ మార్పిడి అన్నట్లుగా అటు ఇటు.ఇటు అటు అయ్యారు.