సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.వచ్చే సంక్రాంతికి అంటూ గత కొంత కాలంగా ప్రచారం చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా డేట్ ప్రకటించారు.
విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఎందుకు అప్పుడే డేట్ ప్రకటించారంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సరిలేరు నీకెవ్వరు చిత్రంను జనవరి 12వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
మహేష్బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ తేదీ ప్రకటన వచ్చిన సమయంలోనే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో విడుదల తేదీ ప్రకటన వచ్చేసింది.అల్లు అర్జున్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంను జనవరి 12న విడుదల చేయబోతున్నట్లుగా డేట్ పోస్టర్ను విడుదల చేశారు.ఇలా రెండు పెద్ద స్టార్ హీరోల క్రేజీ సినిమాలు ఈమద్య కాలంలో ఒకేరోజు వచ్చిన దాఖలాలు లేవు.కాని ఈసారి సంక్రాంతికి హోరా హోరీ తప్పదని మెగా మరియు మహేష్బాబు ఫ్యాన్స్ అంటున్నారు.
ఇద్దరు హీరోలు కూడా స్టార్స్ అయినా మహేష్బాబుకు క్రేజ్ ఎక్కువ ఉంది.అలాగే వరుస విజయాలతో మహేష్బాబు దూకుడు మీదున్నాడు.అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి పరిస్థితి కూడా సక్సెస్ జోష్తో ఉంది.అందుకే సరిలేరు నీకెవ్వరు చిత్రంకు హైప్ ఆకాశాన్ని తాకేలా ఉంది.అయితే అల వైకుంఠపురంలో చిత్రంకు మాత్రం కాస్త తక్కువ ఉంది.కారణం బన్నీ గత చిత్రం నా పేరు శివ ఫ్లాప్, త్రివిక్రమ్ గత చిత్రం అరవింద సమేత అంతంత మాత్రమే.
ఈ కారణాల వల్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే మహేష్ మూవీ పై చేయి సాధించే అవకాశం ఉందని, మహేష్కు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు.