సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది.మహేష్ తల్లి మృతి వల్ల షూటింగ్ కి లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి అసలైతే దసరాకి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయాల్సి ఉంది.కానీ ఇందిరాదేవి మరణం వల్ల అది కూడా వాయిదా వేసే ఛాన్స్ ఉంది.
అయితే ఈలోగా మహేష్ 28 వ సినిమా టైటిల్ ఏంటన్నది మాత్రం ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.దసరాకి రిలీజ్ చేసే పోస్టర్ గురించి లీక్స్ బయటకు వచ్చినట్టు టాక్.
అంతకుముందు అర్జునుడు, పార్ధు లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉండగా లేటెస్ట్ గా మరో టైటిల్ ఫిక్స్ చేశారట త్రివిక్రం.
త్రివిక్రం సినిమాలకు పెద్ద టైటిల్స్ పెడుతుండటం కామన్ అయ్యింది.
త్రివిక్రం కన్ విన్స్ చేస్తాడు కాబట్టి టైటిల్ తాను ఏం అనుకుంటాడో అది పెట్టేస్తాడు ఈ క్రమంలో ఎస్.ఎస్.ఎం.బి 28 వ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట.అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ దసరాకి టైటిల్ పోస్టర్ తో పాటుగా మహేష్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ ఇప్పుడు చిత్రయూనిట్ డెశిషన్ మార్చుకున్నారని తెలుస్తుంది.
మహేష్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నారు.