సూపర్ స్టార్ మహేష్ వరుస ఫ్లాపుల తరువాత కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇంతకు ముందు స్నేహం కొద్ది ఒప్పుకోని సైనికుడు, ఖలేజా, ఆగడు లాంటి ఫ్లాపులతో పాటు బిజినెస్ మెన్ వంటి యావరేజ్ హిట్ ని చవిచూసిన మహేష్, ఆగడు తరువాత తన పద్ధతి మార్చుకున్నాడు.
కథ పూర్తిగా నచ్చితే తప్ప కమిట్మెంట్ ఇవ్వట్లేదు.
అందుకే త్రివిక్రమ్, వినాయక్ లను పక్కనపెట్టి తన 23వ చిత్రాన్ని మంచి కథతో వచ్చిన మురగదాస్ చేతిలో పెట్టాడు.
ఇక 24వ చిత్రానికి సంబంధించి ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి.
మనం దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రస్తుతం సూర్యతో “24” తెరకెక్కిస్తున్నారు.
నిజానికి ఈ కథ ముందు మహేష్ దగ్గరికి వెళ్లిందే.కథపై పుర్తిగా కన్విన్స్ కాని మహేష్ ఈ చిత్రాన్ని ఒప్పకోలేదు.అయితే రెండు నెలలు క్రితం విక్రమ్ చెప్పిన మరో కథ మహేష్ కి బాగా నచ్చిందట.24 చిత్రాన్ని విక్రమ్ బాగా హ్యాండిల్ చేస్తే మహేష్ 24వ చిత్రానికి దర్శకుడు విక్రమ్ కుమార్ అవుతాడు.ఆ సినిమా రిజల్ట్ లో తేడా వస్తే మహేష్ అవకాశం ఇవ్వకపోవచ్చు.
ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరిగా మహేష్ ఉంటాడు.మిగితా నిర్మాతలు ఎవరనేది ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యాక అన్నౌన్స్ చేస్తారు.మహేష్ ప్రస్తుతం ముంబాయిలో బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజిగా ఉన్నారు.