టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.ఈ పేరు వింటేనే క్రికెట్ ప్రియులు ఆనందంతో ఊగిపోతారు.
ఎన్నో రికార్డు, అవార్డులు సొంతం చేసుకున్న ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం ఈయన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020లో టైటిల్ గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇక అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరిగిన ప్రారంభ మ్యాచ్లోనే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సత్తా చాటింది.మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ధోనీకి వందొవ విజయం కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.అంటే ఐపీఎల్లో ఇప్పటిదాకా వంద విజయాలను నమోదు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.
ఇదిలా ఉంటే.ధోనీ గురించి మరో విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 ఫస్ట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ న్యూలుక్తో కనిపించాడు.
ఆయన లుక్ చూస్తుంటే..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.
ఎందుకంటే.
సూపర్ హిట్ మూవీ సింగంలో సూర్య లుక్ మాదిరిగానే ప్రస్తుతం ధోనీ తన గడ్డం స్టయిల్ ను మార్చుకున్నారు.దీంతో ధోనీ లుక్కు ఆయన అభిమానులు ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం ధోనీ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక ధోనీ లుక్ చూసిన నెటిజన్లు సైతం రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరి మీరు కూడా లేట్ చేయకుండా. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్పై ఓ లుక్కేసేయండి.