మహాత్మా గాంధీ ని అవమానించిన లిక్కర్ కంపెనీ

జాతి పిత మహాత్మాగాంధీ కి అవమానం జరిగింది.పరాయి దేశంలో మహాత్మా గాంధీ బొమ్మను మద్యం సీసాలపై ముద్రించి విక్రయాలకు దిగింది.

 Mahatma Gandhi On Bottles Of Israel Based Company1-TeluguStop.com

ఇజ్రాయిల్ కు చెందిన ఒక లిక్కర్ కంపెనీ మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించి మరి విక్రయాలకు దిగడం భారతీయులను ఆగ్రహానికి గురి చేస్తుంది.మకా బ్రూవరీ అనే ఇజ్రాయిల్ కు చెందిన ఒక లిక్కర్ కంపెనీ బీరు సీసాలపై ప్రముఖుల బొమ్మలు ముద్రించి అమ్మకాలు చేస్తుంది.

అయితే ఈ క్రమంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని కూడా ముద్రించారని కేరళ లోని పాలెం కేంద్రంగా పనిచేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ సంస్థ చైర్మన్ ఏబీజే జొస్ దృష్టికి వచ్చింది.దీనితో ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కు కూడా లేఖ రాసి దీనిపై ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలుస్తుంది.

మహాత్మా గాంధీ ని అవమానించిన ల

ఆన్ లైన్ లో కూడా హిట్ స్టోరీ ఆర్ట్.కామ్ అనే వెబ్ సైట్ లోనూ ఈ మద్యం సీసా లను విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది.ఆ సైట్ లో మద్యం బాటిల్స్ పై కూలింగ్ గ్లాస్, టీషర్ట్ దానిపై ఓవర్‌కోట్ ధరించినట్లు మహాత్మా గాంధీ చిత్రాన్ని రూపొందించారు.అయితే ఈ చిత్రాన్ని అమిత్ శిమోనీ అనే వ్యక్తి రూపొందించినట్లు జొస్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube