మణిశర్మ తనయుడు అనే ట్యాగ్ తో సంగీత దర్శకుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి మహతీ స్వర సాగర్.ఈ యువ సంగీత దర్శకుడు అతి కొద్ది కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు.
చలో, భీష్మ లాంటి సినిమాలకి అదిరిపోయే మ్యూజిక్ అందించి ఆ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యువ సంగీత దర్శకులలో బెస్ట్ అనిపించుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
ఇప్పటికి ఐదు సినిమాలకి సంగీతం అందించగా అందులో రెండు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.తండ్రికి తగ్గ తనయుడుగా బ్యాగ్రౌండ్ స్కోర్ లో కూడా మహతీ బెస్ట్ అనిపించుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే ఈ యువ సంగీత దర్శకుడుకి తాజాగా ఊహించని ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోయే వేదాళం సినిమా రీమేక్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా మహతీ స్వర సాగర్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ ని తెరపైకి తీసుకొని వెళ్తారు.
ఆ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తాడని టాక్ నడుస్తుంది.ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మెహర్ సినిమా పట్టాలు ఎక్కుతుంది.
దానికి మరో ఏడాదికి పైగానే సమయం పడుతుంది.ఏది ఏమైనా మెగాస్టార్ సినిమాకి మ్యూజిక్ అందిస్తే ఇక కమర్షియల్ సినిమాలకి చేసే కెపాసిటీ వచ్చేస్తుంది అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా ఉంది.
ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న మహతీకి స్టార్ మ్యూజిషియన్ గా మెగాస్టార్ మూవీ బాటలు వేస్తుందేమో చూడాలి.