ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న దర్శకుడు అజయ్ భూపతి.ఈ యంగ్ దర్శకుడు మొదటి సినిమానే బోల్డ్ అండ్ రియలిస్టిక్ కంటెంట్ తీసుకొని అంతే రియాలిటీగా తెరపై ఆవిష్కరించాడు.
ఒక అబ్బాయిని ప్రేమ పేరుతో వాడుకొని వదిలేసిన అమ్మాయి కథగా దీనిని తెరపై ఆవిష్కరించి పాయల్ రాజ్ పుత్ ని కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ లో ప్రెజెంట్ చేశాడు.ఈ సినిమాతో హీరోయిన్ పాయల్, హీరో కార్తికేయ, దర్శకుడుగా అజయ్ భూపతి స్టార్స్ అయిపోయారు.
ప్రెజెంట్ ట్రెండ్ కి దగ్గరగా ఉన్న కథ కావడంతో అందరికి బాగా కనెక్ట్ అయ్యింది.ఈ సినిమా తర్వాత హీరో, హీరోయిన్లు ఇద్దరు ఫుల్ బిజీ అయిపోయి వరుస సినిమాలు చేస్తున్నారు.
అయితే దర్శకుడు అజయ్ మాత్రం నెక్స్ట్ సినిమా కోసం చాలా ఆలస్యం తీసుకున్నాడు.
మహాసముద్రం అనే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలని ఒప్పించిన అజయ్ హీరోలని మాత్రం మెప్పించలేకపోయాడు.ముందుగా స్టార్ హీరోలతో పాన్ చేశాడు.అయితే ఎవరూ కూడా మల్టీ స్టారర్ కథ అయినా మహా సముద్రంలో చేయడానికి ముందుకి రాలేదు.
ఫైనల్ గా శర్వానంద్ ఒకే చెప్పాడు.తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసి కోలీవుడ్ లో సెటిల్ అయిపోయిన సిద్ధార్ధ్ ని ఒప్పించాడు.
వీరిద్దరూ సెట్ కావడంతో అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని ఆ మధ్య కాన్సెప్ట్ పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు.ఇక ఈ సినిమాలో అదితీరావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ ని హీరోయిన్లుగా ఫైనల్ చేశారు.
తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ అజయ్ భూపతి స్టార్ట్ చేశాడు.మొత్తానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లగలిగాడు.