టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా మహేష్ కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలవడంతో తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు మహేష్.
ఇక మహేష్ నెక్ట్స్ చిత్రం ఎప్పుడు రెడీ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులను అవాక్కు చేస్తు ఓ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్కు రెడీ అయిపోయింది.
అదేమిటి.
మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత ఏ సినిమా చేశాడు? అది ఓటీటీలో ఎందుకు రిలీజ్ అవుతుంది? అనే ప్రశ్నలు మీకు రావచ్చు.అయితే అసలు విషయం ఏమిటంటే, మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.
ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా కమర్షియల్ హిట్ మూవీగా మహర్షి మహేష్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది.అయితే ఈ సినిమాను తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు అక్కడి నిర్మాతలు రెడీ అయ్యారు.
కానీ లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ కాలేదు.దీంతో ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో, ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని తమిళ నిర్మాతలు చూస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లు కుదిరితే, ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవాలని తమిళ నిర్మాతలు చూస్తు్న్నారు.మొత్తానికి కరోనా దెబ్బకు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుండటం గమనార్హం.