సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మహర్షి.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మహర్షి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇక ఇప్పటికి ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉన్న నేపధ్యంలో ఈ సినిమా ట్రైలర్ కాస్తా ఆసక్తి పెంచే విధంగా ఉంది అని చెప్పాలి.
ఇక ట్రైలర్ లో మహేష్ బాబు రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు.జీవితంలో ఉన్నత లక్ష్యాలు, డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని ఎదిగిన హీరో మళ్ళీ అన్ని వదులుకొని ఓడిపోయి ఒక సామాన్యుడుగా ఎందుకు మారాడు అనే కీలకమైన ఎలిమెంట్స్ తో కథనం నడిపించినట్లు ఉంది అని చెప్పాలి.
డైలాగ్స్ లో కొన్ని గత సినిమా వాసనలు కనిపిస్తున్న వంశీ తనదైన కథనంతో సినిమాని నడిపించినట్లు ఉన్నాడని చెప్పాలి.మరి త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న మహర్షి మూవీ నుంచి వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులని ఎంత వరకు ఎంగేజ్ చేస్తుంది అనేది చూడాలి.