మల్టీప్లెక్స్ దోపిడీ షురూ అయ్యింది! మహర్షితోనే మొదలు

ఏదైనా ఓక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వచ్చింది అంటే ఇక ప్రేక్షకుల నుంచి థియేటర్స్ దోపిడీ మొదలైపోతుంది.ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా మహర్షి సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

 Maharshi Movie Ticket Rates Rise In Multiplex Theaters-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈ సినిమా నుంచి మొదటి వారంలోనే వీలైనంత పెట్టుబడి రాబట్టాలనే లక్ష్యంతో థియేటర్స్ యాజమాన్యాలు, నిర్మాతలు ఉన్నారు.అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో అదనపు షోలకి పర్మిషన్ తెచ్చుకున్నారు.

ఈ అదనపు షోల కారణంగా రోజు వచ్చే ఆదాయం కంటే మరింత పెరుగుతుంది.

ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మహర్షి సినిమా టికెట్ ధరలు కూడా ఒక్కసారిగా పెంచేశారు.

మామూలు థియేటర్స్ లో అయితే 80 నుంచి 110కి టికెట్స్ రెట్లు పెంచిన యాజమాన్యాలు, మల్టీప్లెక్స్ లో 150 నుంచి 200 అలాగే 200 నుంచి 250 వరకు టికెట్ ధరలు పెంచేశారు.ఇవన్ని ప్రభుత్వ అనుమతితోనే పెంచినట్లు తెలుస్తుంది.

వేసవి కావడం, ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.ఈ నేపధ్యంలో వారిని టార్గెట్ గా చేసుకొని ఏకంగా 50 రూపాయిలు ఎక్కువగా టికెట్ ధరలు పెంచేశారు.

ఈ ధరలతో మహర్షి సినిమా మొదటి మూడు రోజులల్లో ఏకంగా వంద కోట్లు బిజినెస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube