మహార్షి సినిమా కు సీక్వెల్...2020 లో సెట్స్ పైకి

ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబు మహర్షి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.90 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి రికార్డ్ ని సృష్టించింది.బాబు ల్యాండ్ మార్క్ సినిమా గా వచ్చిన ఈ చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది అని చెప్పాలి.

 Maharshi Movie Sequel Going To The Sets-TeluguStop.com

అయితే వీరిద్దరి కాంబినేషన్ లోనే మరో చిత్రం వస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తుంది.మహర్షి సినిమా కు సీక్వెల్ తీయబోతున్నారు అంటూ ఇప్పుడు ఒక వార్త బాగా వినిపిస్తుంది.అయితే దీనిపై అటు వంశీ గానీ, ఇటు మహేష్ బాబు గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ జనాలు మాత్రం తెగ ఊహించేసుకుంటున్నారు.

ఇంకా ఈ చిత్రం 2020 లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి.

మహార్షి సినిమా కు సీక్వెల్2020

ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం మహర్షి సక్సెస్ తో ఆ చిత్ర బృందం మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మహర్షి సినిమా రిలీజైన తరువాతే మహేష్ తన కుటుంబం తో కలిసి విదేశాలకు టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే ఆయన టూర్ నుంచి తిరిగి వచ్చాక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మహేష్ దృష్టిపెట్టనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube