సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘మహర్షి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మహేష్బాబుకు ఇది 25వ చిత్రం అవ్వడంతో పాటు దాదాపుగా 135 కోట్ల బడ్జెట్ను పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
భారీ బడ్జెట్ మరియు ప్రతిష్టాత్మక మూవీ అవ్వడం వల్ల ఈ చిత్రం రికార్డులు బద్దలు కొడుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఏ పెద్ద హీరో మూవీ అయినా మన వద్ద విడుదల కాకుండానే ఇతర దేశాల్లో కూడా విడుదలకు సిద్దం అవుతుంది.
అక్కడ సెన్సార్ కూడా జరుపుకుంటుంది.
స్టార్ హీరోల సినిమాలు సెన్సార్ చేసి, వాటి రివ్యూలను అందిస్తాడు ప్రముఖ అంతర్జాతీయ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు.
తాజాగా ఈయన మహర్షి చిత్రంకు కూడా రివ్యూ ఇచ్చాడు.ఈయన ఇచ్చిన రివ్యూ ప్రకారం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాయం.5 రేటింగ్కు గాను 4 రేటింగ్ ఇచ్చి సినిమా సూపర్ అంటూ రివ్యూ రాశాడు.మహేష్ బాబు నటన పీక్స్లో ఉందని, విభిన్నమైన నేపథ్యంతో చాలా డిఫరెంట్గా సినిమాను చేశారంటూ ఆయన తన విశ్లేషణ చెప్పాడు.
ఉమైర్ సంధు రివ్యూలు కొన్ని సార్లు తప్పిన విషయం తెల్సిందే.అయితే ఆయన ఇచ్చిన ఈ రివ్యూతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో సినిమాకు ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.మరి ఈ చిత్రంతో మహేష్ బాబు ఏ స్థాయిలో వసూళ్లు చేస్తాడో చూడాలి.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది.అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు.