పతంజలి సంస్థకు షాకిచ్చిన హోంమంత్రిత్వ శాఖ.. వాటికి అనుమతులు లేవట.. ?

రాందేవ్ బాబా పతంజలి సంస్థ గురించి తెలియని వారుండరు.హానికరమైన పదార్ధాలు కలవకుండా ప్యూర్ ఆర్గానిక్ తో వీరి ప్రొడక్ట్స్ ఉంటాయని రాందేవ్ బాబా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

 Maharastra, Home Ministry, Shocked, Patanjali Company, Home Ministry Shock To Pa-TeluguStop.com

ఇక కోవిడ్ 19 దేశంలో తీవ్రంగా ప్రతాపం చూపిస్తున్న సమయంలో పతంజలి సంస్థ వారు కరోనిల్ అనే ట్యాబ్లెట్లను తయారు చేసినట్లు పేర్కొన్నారు.అంతే కాదు కరోనిల్ క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయని పతంజలి సంస్ద వారు వెల్లడించారు.

అయితే పతంజలి వారి కరోనిల్ ట్యాబ్లెట్ల విషయంలో ఈ సంస్దకు హోంమంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకుంది.మహారాష్ట్రలో ఈ ట్యాబ్లెట్లకు అనుమతి ఇవ్వమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పష్టం చేశారు.

కాగా ఇది వరకే కరోనాను తమ కరోనిల్ దీటుగా ఎదుర్కొంటుందని చెపుతూ పతంజలి ఈ మెడిసిన్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కోరోనా వంటి మహమ్మారికి సంబంధించిన మందులు ఆదరాబాదరాగా ఆవిష్కరించడం సరికాదని అనిల్ దేశ్ ముఖ్ అన్నారు.

అందుకే దీనికి అనుమతులు నిరాకరించడం జరిగిందని తెలియచేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube