రాందేవ్ బాబా పతంజలి సంస్థ గురించి తెలియని వారుండరు.హానికరమైన పదార్ధాలు కలవకుండా ప్యూర్ ఆర్గానిక్ తో వీరి ప్రొడక్ట్స్ ఉంటాయని రాందేవ్ బాబా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక కోవిడ్ 19 దేశంలో తీవ్రంగా ప్రతాపం చూపిస్తున్న సమయంలో పతంజలి సంస్థ వారు కరోనిల్ అనే ట్యాబ్లెట్లను తయారు చేసినట్లు పేర్కొన్నారు.అంతే కాదు కరోనిల్ క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయని పతంజలి సంస్ద వారు వెల్లడించారు.
అయితే పతంజలి వారి కరోనిల్ ట్యాబ్లెట్ల విషయంలో ఈ సంస్దకు హోంమంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకుంది.మహారాష్ట్రలో ఈ ట్యాబ్లెట్లకు అనుమతి ఇవ్వమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పష్టం చేశారు.
కాగా ఇది వరకే కరోనాను తమ కరోనిల్ దీటుగా ఎదుర్కొంటుందని చెపుతూ పతంజలి ఈ మెడిసిన్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కోరోనా వంటి మహమ్మారికి సంబంధించిన మందులు ఆదరాబాదరాగా ఆవిష్కరించడం సరికాదని అనిల్ దేశ్ ముఖ్ అన్నారు.
అందుకే దీనికి అనుమతులు నిరాకరించడం జరిగిందని తెలియచేశారు.