మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాగపూర్ విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటే మంచి చెడుల మధ్య అంతరం తెలుస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.దేశంలో ప్రతీరోజూ మహిళలపై సాగుతున్న దారుణ అత్యాచారాల ఘటనల నేపథ్యంలో నాగపూర్ యూనివర్శిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ భగత్సింగ్ కోషియారీ ఈ వ్యాఖ్యలు చేశారు.
నాగపూర్ విశ్వవిద్యాలయంలో జమ్నాలాల్ బజాజ్ పరిపాలనా భవనాన్ని ప్రారంభించిన గవర్నరు మాట్లాడుతూ సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటే మంచి చెడుల మధ్య ఉన్న అంతరం తెలుస్తుందన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ శేఖర్ బజాజ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.
ఇటీవల హైదరాబాద్ ఘటనలో చోటుచేసుకున్న దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటన జరిగిన 10 రోజుల్లోనే నిందితులు ఎంకౌంటర్ లో మృతి చెందారు కూడా.ఇంత జరిగినప్పటికీ కూడా దేశ వ్యాప్తంగా మహిళల పై దారుణాలు మాత్రం ఆగడం లేదు.ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసారు.