మనం ఇంత వరకు ఎక్కడైనా సరే కేవలం మనుషులకు, జంతువులకు మాత్రమే పోస్టుమార్టం నిర్వహించడం చూశాం.అయితే తాజాగా మహారాష్ట్ర పోలీసులు చేసిన నిర్వహణకు ఓ బొమ్మ కూడా పోస్టుమార్టం చేయాల్సి వచ్చింది.
అవును మీరు విన్నది నిజమే. మహారాష్ట్ర పోలీసులు తొందరలో శిశువు అనుకొని బొమ్మను తీసుకువచ్చి పోస్టుమార్టం చేయమని డాక్టర్లకు ఇచ్చారు.
అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే డాక్టర్లు కూడా ఆ బొమ్మను తీసుకు వెళ్లి పోస్టుమార్టం కోసం తీసుకువెళ్లి కోసి చూడగా అది మృతదేహం కాదని కేవలం ఆటబొమ్మ మాత్రమే అని తేల్చారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్ర బుల్దానా జిల్లా బోర్ జవల్ గ్రామం సమీపంలో ఓ నదిలో ఈనెల 9వ తారీఖున శిశువు మృతదేహం స్థానికులకు కనిపించింది.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.ఆ తర్వాత మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.
ఆ పై కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.అంత పసిబిడ్డను నదిలో ఎవరైనా పడేశారో లేకపోతే ఎవరైనా చంపేశారా లాంటి అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు అనుకున్నారు.
ఇక అందులో భాగంగానే ఆ శిశువు ఎలా మరణించింది అన్న విషయంపై శోధన కోసం మృతదేహం అని భావించిన ఆ బొమ్మను పోస్టుమార్టం కొరకు ఆసుపత్రికి తరలించారు.ఇక అక్కడ అసలు విషయం బయట పడింది.
అది శిశువు మృతదేహం కాదని అది అచ్చం శిశువు లా కనిపించే ఆటబొమ్మ అని తేల్చారు.దీంతో ఆ పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు.
మనిషికి బొమ్మ కి తేడా తెలియకుండా పోలీసులు ఎలా అయ్యామని బాధ పడ్డారు కాబోలు.