దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం విదితమే.మరి ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.
అయితే ఈ మహమ్మారి ఇంతగా కోరలు చాపుతున్నప్పటికీ కూడా కరోనా వారియర్స్ మాత్రం తమ విధులను నిర్వర్తించడం తప్పడం లేదు.ఈ పోరాటంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వారిలో పోలీసులే ముందు ఉన్నారు.
మహారాష్ట్రలోని పోలీసులపై కరోనా రక్కసి పంజా విసురుతూనే ఉంది.ఇప్పటికే ఈ మహమ్మారికి బలైన పోలీసుల సంఖ్య 234 కు చేరినట్లు తెలుస్తుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం కరోనా బారినడుతున్న పోలీసుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు.రోజురోజుకు ఆ రాష్ట్రంలో కరోనా సోకుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
తాజాగా ఆ రాష్ట్రంలో 253 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నమోదు కాగా, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 21,827 మంది పోలీసులు ఈ మహమ్మారి బారిన పడ్డారు.ఇందులో 18,158 మంది కోలుకోగా, 3435 మంది చికిత్స పొందుతున్నారని మహారాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది.
అయితే గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఐదుగురు పోలీసులు కరోనాతో చనిపోవడంతో ఇప్పుడు ఆ రాష్ట్రవ్యాప్తంగా మరణించిన పోలీసుల సంఖ్య 234కు చేరినట్లు తెలుస్తుంది.మహా రాష్ట్రలో ఈరోజు 18,390 కరోనా కేసులు నమోదవ్వగా, కొత్తగా 392 మంది మరణించారు.
ఈ తాజా సమాచారం తో ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,42,770 మంది కరోనా బారిన పడగా, ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 33,407 గా నమోదు అయినట్లు తెలుస్తుంది.