కుక్కను బైక్'కి కట్టి కిలోమీటర్ ఈడ్చుకువెళ్లిన వ్యక్తి ...!

రెండు రోజుల క్రితం కేరళ రాష్ట్రంలో గర్బిని ఏనుగును ఫైనాపిల్ పండులో మందు సామాను ఉంచి దానికి తినిపించడంతో మరణించిన సంఘటన మరువకముందే మరో దారుణం సంఘటన చోటు చేసుకుంది.అంతేకాదు కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు కేరళలో మరో చోట ఏకంగా 20 ఏనుగుల వరకు చనిపోయాయి.

 Another Atrocity In Maharashtra, A Man Who Tied A Dog With A Belt, Dog With Belt-TeluguStop.com

ఇకపోతే తాజాగా మహారాష్ట్రలో కూడా ఇలాంటి మరో దారుణం చోటుచేసుకుంది.

ఒక శునకానికి తన మెడకు తాడు కట్టి దానిని బైక్ వెనకాల కూర్చొని ఏకంగా కిలోమీటరు దూరం వరకు లాక్కు వెళ్ళాడు ఒక దుర్మార్గుడు.

అమానుష సంఘటన బైక్ వెనకాల వస్తున్న వాహనదారులు తమ సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.తాజాగా ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్ గా మారిపోయింది.

శునకాన్ని తాడుతో కట్టేసి బైక్ వెనకాల కూర్చొని అలా ఈడ్చుకు వెళ్ళారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు.

అయితే ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో చోటు చేసుకుంది.ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఆ నిందితులకు ” జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం ” కింద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.అంతేకాకుండా నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు.

నిజానికి మూగజీవాలను ఇలా చేయడం వారికి ఎలా ఆనందం చేకూరుతుందో అర్థం అవ్వట్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube