భారతదేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి… ఏ రాష్ట్రంలో లేనంతగా మహారాష్ట్రలో కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే.మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఏకంగా దేశానికి శాపంగా మారుతోంది.
రోజురోజుకు భారీ మొత్తంలో కేసులు నమోదు అవుతుండడంతో.ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో కి వెళుతుంది.
తాజాగా 24 గంటల్లో 5,024 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.అయితే గడిచిన 24 గంటల్లోనే ఏకంగా మహారాష్ట్రలో 175 మంది మరణించారు.ఇక తాజాగా నమోదైన 5వేలకు పైగా కేసులతో మొత్తంగా మహారాష్ట్రలో నమోదైన కేసుల సంఖ్య 1,47,441 చేరింది.కరోనా మరణాల సంఖ్య 6931 చేరింది.
ఈ మహమ్మారి వైరస్ రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తుండడంతో అటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.తమ ప్రాణాలు ఉంటాయా.ఉడతాయా అనే గ్యారెంటీ లేని జీవితాన్ని గడుపుతున్నారు.కాగా ఇప్పటివరకు 77453 మంది మహారాష్ట్రలో కరోనా వైరస్ నుండి కోలుకోగా.
ప్రస్తుతం 65893 ఆక్టివ్ కేసులున్నాయి.