మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సరిగ్గా వార్ధా జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు ప్రాణం విడిచారు.
దత్త మేఘె వైద్య కళాశాలకు చెందిన ఈ విద్యార్థులు యావత్ మాల్ నుండి ఈ వార్ధాకు కారులో వెళ్తున్న సమయంలో… అర్ధరాత్రి వేళ ఈ ప్రమాదం జరిగింది.వేగంగా వెళుతున్న కారు నీ డ్రైవర్ నియంత్రించలేక డివైడర్ ను ఢీకొట్టడంతో అదుపుతప్పి వంతెనపై నుంచి కింద పడి ప్రమాదానికి గురయింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులందరూ అక్కడి కక్కడే మృతి చెందారు.ఇక అదే సమయంలో రోడ్డుపై లారీ వెళ్తున్న తరుణంలో సదరు లారీ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… ఒక పక్క సహాయక చర్యలు చేపడుతూనే మరోపక్క విచారణ స్టార్ట్ చేశారు.ఈ తరుణంలో మృతుల్లో గొండియా జిల్లా కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్ డెల్ ఏకైక కుమారుడు ఆవిష్కార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇక ఇదే సమయంలో స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేయగా… అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.దీంతో మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు.