మహానటి అనగానే అలనాటి తార సావిత్రి కంటే ముందు గుర్తొచ్చే నటి కీర్తి సురేష్.మహానటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ కు ఈ సినిమాతోనే కెరీర్ మరింత మొదలైందని చెప్పవచ్చు.
అలా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది కీర్తి సురేష్.
ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా సన్నబడి నాజూగ్గా తయారైంది.పైగా డ్రెస్సింగ్ స్టైల్ ను కూడా మార్చేసింది.ఇక గ్లామర్ ను కూడా పరిచయం చేస్తుంది.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇక కీర్తి సురేష్ జాబ్ కోసం ఓ ఇంటర్వ్యూ పాల్గొన్నది.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులు లాక్ డౌన్ కారణంగా తాను గడిపిన క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో బాగా పంచుకుంది.ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ వీడియో ఒకటి వైరల్ గా మారింది.అందులో తను చీఫ్ ఫుడ్ ఆఫీసర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ లో పాల్గొన్నది.ఇక ఇంటర్వ్యూలో తనకు కుకింగ్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవడంతో వాటికి కొన్ని సమాధానాలు బాగానే చెప్పింది.
ఇక మరికొన్ని తప్పులు చెప్పగా వాటికి ఇచ్చిన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంది.
సరదాకి పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాత్రం నిజంగా ఏదో జాబ్ కోసం పోటీ పడుతున్నట్లుగా కంగారుపడుతూ సమాధానమిచ్చింది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉంది.ఇక రజనీకాంత్ తో మరో సినిమాలో నటిస్తుంది.