గతేడాది నుంచి మహాలక్ష్మి రవీందర్ జోడీ గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ జోడీ పెళ్లి చేసుకున్న సమయంలో మహాలక్ష్మి రవీందర్ ను పెళ్లి చేసుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని కామెంట్లు వినిపించాయి.
అయితే పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా ఈ జోడీ గురించి జోరుగా చర్చ జరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా మహాలక్ష్మి బెడ్ రూమ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే మహాలక్ష్మి బెడ్ రూమ్ ఫోటో షేర్ చేయడంతో కొంతమంది నెటిజన్లు శుభవార్త ఎప్పుడు చెబుతారంటూ కామెంట్ చేస్తున్నారు.మహాలక్ష్మి తల్లి అవుతాననే శుభవార్త చెప్పాలని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
భర్తతో కలిసి దిగిన ఫోటోలను మహాలక్ష్మి తరచూ ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.
సోఫాలో కూర్చుని మహాలక్ష్మి ఫోజులిచ్చారు.కొంతమంది నెటిజన్లు మహాలక్ష్మి రవీందర్ అన్యోన్యంగా ఉండాలని సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను వాళ్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.రవీందర్ కు మహాలక్ష్మికి మరో వ్యక్తితో పెళ్లి జరగగా ఆ వ్యక్తికి విడాకులు ఇచ్చి మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నారు.
తమిళంలో మహాలక్ష్మికి నటిగా మంచి గుర్తింపు ఉండగా రవీందర్ మాత్రం నిర్మాతగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.కెరీర్ విషయంలో వీళ్ల ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ల రేంజ్ లో మహాలక్ష్మి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉండటం గమనార్హం.మహాలక్ష్మి కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా తప్పటడుగులు పడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
మహాలక్ష్మికి అంతా మంచే జరగాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.